వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై మంత్రి శ్రీరంగ నాథ రాజు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే అసలు ప్రజల వైపు కనీసం చూసారా అని ఆయన నిలదీశారు. మీడియా ముందుకు వచ్చి అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారు అని అయన మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా సరే కనీసం ఇప్పటి వరకు నియోజకవర్గానికి రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ చెయ్యాలి అని అయన సూచించారు. క్రమశిక్షణ తో ఉండే వారే పార్టీలో ఉండాలి అని ఆయన స్పష్టం చేసారు. రఘురామ కృష్ణం రాజుని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి అని ఆయన స్పష్టం చేసారు. సిఎం జగన్ కింద పని చేయడం అద్రుష్టం అని అన్నారు.