ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం గానూ కార్పోరేషన్ ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడు పార్టీలకు అతీతంగా స్వాగతిస్తున్నారు. ప్రతీ ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని ఇప్పుడు కొనియాడుతున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా వారి కోసం సిఎం జగన్ అండగా ఉన్నారు అని కొనియాడుతున్నారు. తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.
జగన్ గారి హయాంలో లంచాలు, సిఫార్సులు, దళారీలకు చోటే లేదు. అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత ఉందన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా APCOS ప్రారంభమైందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు పాటిస్తూ 47000 ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టారని అన్నారు.
జగన్ గారి హయాంలో లంచాలు, సిఫార్సులు, దళారీలకు చోటే లేదు.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 3, 2020
ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లోనూ పారదర్శకత.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా APCOS ప్రారంభం.
బడుగు బలహీన వర్గాలు, మహిళలకు రిజర్వేషన్లు పాటిస్తూ 47000 ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు.