ప్రధాని మోదీ నేడు నేడు లడఖ్ కు ఆకస్మికంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సముద్రమట్టఅనికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్న నీమ్ లో మాట్లాడుతూ సైనికులు ఇంత కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం కృషి చూస్తున్నారని అన్నారు. దేశమంతా సైనికులను చూసి స్పూర్తి పొందిందని చెప్పారు. ప్రపంచం మొత్తానికి భారత్ గట్టి సందేశం ఇచ్చిందని తెలిపారు. సైనికుల ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని వ్యాఖ్యలు చేశారు. 
 
లడఖ్ నుంచి కార్గిల్ వరకు మీ ప్రయత్నం అమోఘం అని అన్నారు. భారత్ శత్రువులకు గట్టి గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. భారత్ సైనికుల తెగువ వెల కట్టలేనిదని మోదీ చెప్పారు. ప్రధాని మోదీ లడఖ్ ఆకస్మిక పర్యటనతో చైనా ఒక్కసారిగా షాక్ కు గురైంది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: