ప్రధాని మోదీ లడఖ్ పర్యటనలో మాట్లాడుతూ సైనికులు భారత శత్రువులకు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రపంచం మొత్తానికి భారత్ గట్టి సందేశం ఇచ్చిందని తెలిపారు. ధైర్యవంతులే శాంతి కోరుకుంటారని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. లడఖ్ నుంచి కార్గిల్ వరకు సైనికుల సైనికుల ధైర్యం అద్భుతం అని పేర్కొన్నారు. అమరులైన సైనికులకు మరోసారి మోదీ నివాళి అర్పించారు. దేశ భద్రతంతా జవాన్ల చేతిలోనే ఉందని చెప్పారు. 
 
శాంతి విషయంలో భారత్ నిబద్ధతను ప్రపంచ దేశాలు గమనించాయని అన్నారు. జవాన్ల త్యాగం నిరూపమానమైనదని... సైనికులు కఠిన పరిస్థితుల్లోను దేశం కోసం ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. ఆధునిక సాంకేతికను, అభివృద్ధిని అందిపుచ్చుకుందామని మోదీ సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: