దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా.. ఆడవారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. ఈ మద్య చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నారు కామాంధులు. తమిళనాడులో ఓ ఏడేళ్ళ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపాడు ఓ దుర్మార్గుడు. దాంతో ఇప్పుడు తమిళనాట పెద్ద ఎత్తున గొడవలే జరుగుతున్నాయి. ఇక దేశంలో నిర్భయ, దిశ కేసుల్లో నేరస్థులు శిక్ష అనుభవించారు... వాళ్లను చూసి కూడా ఎవరూ భయపడటం లేదు. తాజాగా
చిత్తూరు జిల్లాపుంగనూరు మండలం గూడూరుపల్లెలో దారుణం జరిగింది.

 

బాలికపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారానికి తెగబడ్డాడు. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్నానం చేసి ఇంటిలోకి వెళ్తుండగా అటకాయించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంఘటన జరిగిన రెండు రోజులు తర్వాత బాధిత తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అయితే ఈ కేసు విషయంలో ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం.  అంతే కాదు గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ విఫలం కావడంతో బాలిక తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: