గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాల్లో వేడి రాజుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు అచ్చెన్నాయుడి అరెస్ట్.. మరోవైపు సొంత పార్టీపైనే రఘురామ కృష్ణంరాజు రుస రుసలు వెరసీ ఈ గోల ఢిల్లీ దాకా వెళ్లింది.  నేడు గన్నవరం ఎయిర్ పోర్టు నుండి  ఢిల్లీ వెళ్లనున్న ఎంపీలు బయలు దేరిన విషయం తెలిసిందే. తమ పార్టీలో ఉంటూ పార్టీ నియనిబంధనలు తుంగలో తొక్కేస్తున్న ఎంపీ రఘురామకృష్ణరాజు తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

ఈ నేపథ్యంలో  పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు వేయాలని  లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేశారు.  ఈ నేపథ్యంలో స్పీకర్ ని కలిసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్ కలిశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: