ఉత్తరప్రదేశ్ లో కరోనా తీవ్రత ఇప్పుడే  మొదలయింది. అక్కడ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ కిల్లర్ వైరస్ ఇప్పుడు నిదానంగా అంటుకుంది. కరోనా వైరస్ నిదానంగా అక్కడ రోజు రోజుకి వందల కేసుల నుంచి వేల కేసుల వరకు వెళ్తుంది. అక్కడ నిన్న దాదాపుగా వెయ్యి కేసుల వరకు నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

గత 24 గంటల్లో రాష్ట్రంలో 982 కొత్త  కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇప్పటివరకు 7451 క్రియాశీల కేసులు ఉన్నాయని... 17,557 మంది కరోనా నుంచి కోలుకున్నారు అని... 749 మంది కరోనా కారణంగా మరణించారు అని ఉత్తర ప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్య) అమిత్ మోహన్ ప్రసాద్ వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: