వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు నైతిక విలువలు కోల్పోయారు అని వైసీపీ ఎంపీలు మండిపడ్డారు. ఆయన  పార్టీ అధిష్టానం కి ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదు అని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన  టీటీడీ వివాదంపై ఈవో తో గాని చైర్మన్ తో గాని చర్చించలేదు అని మండిపడ్డారు. టీటీడీ భూముల అమ్మకాలు అంటూ ఏదో ఊహించుకుని మాట్లాడారు అని మండిపడ్డారు. 

 

ఆయన ఇసుక దోపిడీ అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారు అని ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి ఆయన నేరుగా తీసుకుని రాలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కలిసిన అనంతరం  మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తొలిసారి ఎంపీ గా గెలిచిన ఆయనకు సిఎం జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: