నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అని వైసీపీ ఎంపీలు సవాల్ చేసారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు ఆయన లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాలి అని అన్నారు. 

 

రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరి ఫోటోకి ఎంత విలువ ఉందో అందరికి తెలుస్తుంది అని వ్యాఖ్యలు చేసారు. ఆయన ఊహల్లో ఉన్నారు అని ఆయన ఊహలు ఎప్పటికి నిజం కావని వైసీపీ ఎంపీలు ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఆయనను ఒక శక్తి నడిపిస్తుంది అని అది ఏంటీ అనేది తమకు తెలుసు అని ఎంపీలు వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: