ఒక పక్క వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే మావోయిస్ట్ లు మాత్రం మారడం లేదు. తాజాగా మావోలు భద్రతా బలగాలను చంపడానికి గానూ చత్తీస్ఘడ్ లో చేసిన కుట్రను పోలీసు బలగాలు చేదించాయి. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) 41 వ బెటాలియన్ ఈ రోజు ఆ రాష్ట్రంలోని కొండగావ్ జిల్లాలోని నహక్నార్ సమీపంలో బయనార్ రహదారిలో పాతిన ఐఇడి ని గుర్తించారు. 

 

దీనిని బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసింది అని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల  మావోలు బాణాలతో ఒక కానిస్టేబుల్ ని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీనితో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: