కాన్పూర్ జిల్లాలో  జరిగిన ఎదురు కాల్పుల్లో పోలీసులు 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో  జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఒక రౌడీ షీటర్ ని పట్టుకోవడానికి వెళ్ళిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఈ  కాల్పుల్లో ఒక ఐపిఎస్ అధికారి కూడా మరణించడం సంచలనంగా మారింది. 

 

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు... సిఎం యోగి ఆదిత్య నాథ్ నివాళులు ఆరోపించారు. కాన్పూర్ జిల్లాలోని బికారు గ్రామంలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం కూడా చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: