ఇటీవల కరోన వైరస్ తో పోరాటం చేస్తో ప్రాణాలు కోల్పయిన డాక్టర్ అసీం గుప్తా కుటుంబానికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ సహాయం చేసారు. ఆయన కుటుంబానికి రూ ఒక కోటి చెక్ ని ఆయన అందించారు. శుక్రవారం ఆయన తన చేతులతో స్వయంగా కుటుంబానికి సాయం చేసారు. ఆయన సాకేత్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

 

కరోనా వైరస్ ఢిల్లీ లో అడుగుపెట్టిన సమయంలోనే వైద్యులు ఎవరు అయినా మరణిస్తే వారికి కోటి ఆర్ధిక సహాయం చేస్తామని సిఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్‌గా పని చేసే వారు. ఆయనకు జూన్ ఆరున కరోనా వచ్చింది. వ్యాధి తీవ్రం కావడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: