బీహార్ ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది, పిడుగుపాటుకు బీహార్లో ఏకంగా 25 మంది మృతి చెందారు, వారం రోజుల నుంచి పిడుగులు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బీహార్ లో ఎంతోమంది మృత్యువాత పడ్డారు,
ఇక పిడుగుపాటుకు మృతి చెందిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపి వారి కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారం ఇస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లో పిడుగు పడి ఐదుగురు మరణించారు.