పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాంట్లో పది మంది సిక్కు యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. షేక్పురా రైల్వే స్టేషన్ వద్ద షా హుస్సేన్ ఎక్స్ప్రెస్ను.. సిక్కు యాత్రికులు వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. నాన్కానా సాహిబ్ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒకే ఫ్యామిలీకి చెందిన 25 మంది యాత్రికులు మినీ బస్సులో వెళుతుండగా ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. షేక్పురాలో మానవరహిత లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటన తర్వాత డివిజినల్ ఇంజినీర్ను సస్పెండ్ చేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రి షేక్ రషీద్ ఆదేశించారు. ఇదిలా ఉంటే నాలుగు నెలల క్రితం సింధు ప్రావిన్సులో కూడా రైల్వే క్రాసింగ్ వద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 19 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు.