అన్ లాక్ దశ ప్రారంభం అయిన తర్వాత దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి అని ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా పరిక్షల సంఖ్యను భారీగా పెంచామని అన్నారు. 9.7 లక్షల కరోనా పరిక్షలు చేసామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. 

 

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు 20 వేల మందికి కరోనా పరిక్షలు నిర్వహించామని ఆయన చెప్పారు. కరోనా పరిక్షల సంఖ్యను భారీగా పెంచుతామని కూడా చెప్పారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులతో పాటుగా, వ్యవసాయ కూలీలకు కూడా కరోనా పరిక్షలు చేస్తున్నామని అన్నారు. కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: