టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరారీ లో ఉన్నారు. ఇటీవల రవాణా శాఖా మంత్రి పేర్ని నానీ అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసుకి సంబంధించి ఆయనను విచారించడానికి గానూ బందరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా ఆయన ఇంట్లో లేరు. ఆయన పరారీ లో ఉన్నారు అని పోలీసులు గుర్తించారు. 

 

ఆయన ఉంటే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. ఈ విషయం ముందే తెలుసుకున్న ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని తెలుస్తుంది. దీనితో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆయనను రేపు లేదా ఎల్లుండి అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. కాగా ఆయనను ఈ కేసులో ఏ 4 గా చేర్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: