ఇప్పుడు బిజెపి ఎంపీలకు బిజెపి నేతలకు కరోనా భయ౦ పట్టుకుంది. ఇటీవల బిజెపి సీనియర్ నేత ఒకరికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ఆ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక హూగ్లీ నుంచి ఎంపీగా  ఉన్నారు. 

 

తనకు కరోనా వచ్చింది అనే విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. తనకు గత వారం రోజులుగా జ్వరంగా ఉందని ఆమె తన ట్వీట్ లో చెప్పారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను అని ఆమె పేర్కొన్నారు. తనకు నిన్న సాయంత్రం కరోనా పరిక్షలు చేసారు అని ఇవాళ ఉదయం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: