ఇటీవల గాల్వాన్ లోయలో గాయపడిన సైనికులను ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. ఆయన లడఖ్ పర్యటన సందర్భంగా అక్కడి ఆస్పత్రులకు వెళ్ళారు. ఈ సందర్భంగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఒక్కొక్కరిని పలకరించారు మోడీ. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. మీ నుంచి బయటకు వచ్చిన రక్తం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. 

 

మీరు ధైర్యంగా చూపిన శౌర్యం ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది అని సైనికులతో మోడీ ఈ సందర్భంగా అన్నారు. ఈ ధైర్యవంతులు ఎవరు అని ప్రపంచం తెలుసుకోవాలనుకుంటుంది? వారి శిక్షణ ఏమిటి? అనే విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని భావిస్తుంది అంటూ ఆయన పేర్కొన్నారు. మీతో పాటు మీలాంటి ధైర్యవంతులకు జన్మనిచ్చిన తల్లులకు కూడా నా నివాళులు అర్పిస్తున్నాను అంటూ మోడీ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: