ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. పొన్నూరు ఎంఎల్ఏ కిలారి వెంకట రోశయ్య తనకు పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు కూడా తనలో కనిపించలేదని చెప్పారు. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకుని హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు ప్రకటన చేశారు. 
 
నియోజకవర్గం ప్రజలకు మొబైల్, వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. దైర్యంగా కరోనాను ఎదుర్కొంటానని వైరస్ అంటే భయపడటం లేదని వ్యాఖ్యలు చేశారు. మరో ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: