ఢిల్లీ , హరియాణాలో పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్​ స్కేలు​పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. కొద్ది సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురుగావ్‌కు నైరుతి దిశలో 63 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. ఇటీవల ఉత్తరాదిన తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి.

 

ఈ మధ్యన భూప్రకంపనలు చోటుచేసుకోవడం చాలావరకు తగ్గాయి. ఇప్పుడు ఆశ్చర్యంగా ఒక్కసారిగా దేశం నడిబొడ్డున ఈ విధంగా చోటు చేసుకోవడం కూడా కొంత మేరకు ఆలోచించవలసిన విషయం గా నిపుణులు పరిగణిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన భూప్రకంపనలు కేవలం కొద్ది సెకన్ల పాటు ఉండటం పెద్దగా నష్టం కలిగించలేదని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: