భారీ వర్షాల వల్ల వరదలతో అతలాకుతలం అవుతోంది అసోం. రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అసోం వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.
రాష్ట్రంలో కరోనా, వరదల బీభత్సం వంటి విషయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని అసోం సీఎం సోనోవాల్ తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని అందించనున్నట్లు మోదీ చెప్పారని పేర్కొన్నారు.వరదల వల్ల అసోంలో 33 జిల్లాలకు గానూ 22 జిల్లాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 16.03 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.
PM @narendramodi has sanctioned ex-gratia of Rs. 2 lakh each for next of kin of persons who lost their lives due to floods in assam, from PMNRF.
— PMO india (@PMOIndia) July 3, 2020