ప్రైవేటు ల్యాబుల్లో చేస్తున్న కరోనా పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం  ఓ ల్యాబ్​లో చేసిన పరీక్షల్లో సుమారు 71.7 శాతం మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. సదరు ల్యాబ్​లో 3,726 నమూనాలను పరీక్షించగా 2,672 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

 


 ఇది సాధారణ సగటుతో పోలిస్తే చాలా అధికంగా ఉంది. ప్రైవేటు ల్యాబ్​ ఫలితాలను మరోసారి వైద్యారోగ్య శాఖ పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో సదరు ల్యాబ్​ చేసిన పరీక్షల ఫలితాలను నిపుణుల కమిటీ పరిశీలించే వరకు ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకోబోమని ప్రభుత్వం ప్రకటించింది

మరింత సమాచారం తెలుసుకోండి: