ఏపీ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను వ్యాన్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. కంభంవారిపల్లి మండలం చిత్తూరు-కడప ప్రధాన రహదారిలోని సొరకాయల పేట చెరువు కట్టపై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు దామోదర్ (45), సుజనమ్మ (40), వెంకట్రామయ్య (55), గోవర్థిని(25), పార్వతమ్మగా పోలీసులు గుర్తించారు.

 


మృతులంతా కలకడ మండలం కొత్తగాండ్లపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న తమ బంధువు మృతదేహాన్ని చివరి చూపు చూసి... గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరగడం బాధిత బంధువులను తీవ్రంగా కలిచివేస్తోంది. అతివేగంతో ఎదురుగా వచ్చిన ఐషర్ వాహనం వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వారు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: