తెరాస రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కి ఇప్పుడు మంచి స్పందన వస్తుంది. రాజకీయ సినీ ప్రముఖులు అందరూ కూడా దీనిపై స్పందిస్తూ తమదైన శైలిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. 

 

తాజాగా ప్రముఖ నటి రేణు దేశాయ్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆమె మొక్కలు నాటారు. ఇటీవల ప్రముఖ బుల్లితెర యాంకర్‌ ఉదయ భాను ఇచ్చిన చాలెంజ్‌ను  స్వీకరించిన ఆమె... జూబ్లీహిల్స్‌లోని ఒక పార్కులో శుక్రవారం తన కుమార్తె ఆద్య, స్నేహితురాలు యషికతో కలిసి రేణు మొక్కలు నాటి తన వంతు పాత్ర పోషించారు. ఆమె ఇప్పుడు రెండు సినిమాల్లో చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: