దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కరోనా పరిక్షలు కూడా వేగంగానే చేస్తున్నారు. రోజు రోజు కి కరోనా పరిక్షల సంఖ్యను పెంచుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక ఇదిలా ఉంటే తాజాగా కరోనా పరిక్షలు మరోసారి దేశ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. 

 

జూలై 3 వరకు పరీక్షించిన మొత్తం నమూనాల సంఖ్య 95,40,132 అని ఐసిఎంఆర్ ప్రకటించింది. వీటిలో 2,42,383 నమూనాలను నిన్న పరీక్షించారని చెప్పింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్). కాగా దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు కూడా భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్క రోజే... 21 వేల కేసుల వరకు నమోదు అయ్యాయి.  నేడు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: