తెలంగాణా సిఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో... కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అక్కడ కరోనా కేసులు పెరగడం అది కూడా భారీగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రగతి భవన్ లో మొత్తం 30 మందికి కరోనా సోకింది అని అధికారులు ప్రకటించారు. నిన్న... ఆ సంఖ్య 20 గా ఉండగా నేడు మరో పది పెరిగింది. 

 

దీనితో ఇప్పటికే ప్రగతి భవన్ లో అధికారులు అన్ని విధాలుగా శానిటేషన్ కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రత్యేక వైద్య అధికారుల పర్యవేక్షణ లో ఈ చర్యలు జరుగుతున్నాయి. ఇక సిఎం కేసీఆర్ కుటుంబానికి కూడా కోరనా పరిక్షలు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. నేడు లేదా రేపు చేయనున్నారు పరిక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: