వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కూడా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ సిఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. 

 

అదే విధంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి మానవాళికి త్వరగా విముక్తి కలగాలని తాను స్వామి వారిని వేడుకున్నా అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్న సరే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి మాత్రం భక్తులకు సంతృప్తికరంగా స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: