రాజకీయాల్లో మిస్టర్ క్లీన్ గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్ చేసి సిఎం వైఎస్ జగన్... గారు తన మూర్ఖత్వాన్ని, రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బీసీలకు చేస్తున్న అన్యాయం బయట పడుతుంది అనే భయం జగన్ రెడ్డి గారిని వెంటాడుతోందన్నారు. 

 

అందుకే బలమైన బీసి నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. అసమర్థ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ కొల్లు రవీంద్ర పోరాడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగా జరిగిన కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల్ని గాలికొదిలేసి,అధికారాన్ని కేవలం తన కక్ష సాధింపు కోసం వినియోగించుకుంటున్నారు.ఎన్ని సార్లు చివాట్లు తిన్నా జగన్ రెడ్డి గారి బుద్ధి మారడం లేదు.” అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: