ఇటీవలి కాలంలో తెలంగాణా పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకుంటున్నారు. వరుసగా  గంజాయి భారీగా దొరుకుతుంది. తాజాగా నల్గొండ జిల్లాలోని నకిరేకల్  మండలం చందంపల్లి స్టేజ్ వద్ద ప్రమాదానికి గురైన కారులో 50 కేజీల గంజాయి పోలీసులకు దొరికింది. ప్రమాదానికి కారు గురైన వెంటనే... 

 

కారును అక్కడే వదిలి వారు పారిపోయారు. అదే విధంగా వారితో ప్రయాణం చేస్తున్న ఒక మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఇది మహారాష్ట్రకు చెందిన కారు.  ఇటీవల కూడా ఇక్కడ  గత నెలలో 100 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడి స్థానికులు ఉలిక్కి పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: