ఏపీ సిఎం వైఎస్ జగన్ పై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్.. బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ఆయన మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు నేడు జగన్ కూడా బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారారని  ఆయన మండిపడ్డారు. 

 

రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. సోనియా, రాహుల్ అమరావతి, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి మద్దతు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు ముక్కాలా ఆట ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: