ఆంధ్రప్రదేశ్ బిజెపిలో ఇప్పుడు కరోనా భయం పట్టుకుంది. బిజెపి నేతల్లో కొందరికి కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దియోధర్ ఒక కార్యక్రమంలో  పాల్గొన్న  నేతల్లో ఒకరికి కరోనా సోకింది. ఆ తర్వాత పరిక్షలు చేయగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కి కూడా కరోనా ఉంది అని పరీక్షల్లో వెల్లడి అయింది. 

 

ఇక మిగిలిన నేతలు అందరికి కూడా కరోనా పరిక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పుడు చాలా మంది నేతలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా హోం క్వారంటైన్ లో ఉండిపోయారు. వారిలో చాలా మందికి కరోనా లక్షణాలు ఉన్నాయి అనే వార్తలు బిజెపి నేతలను బాగా కలవరపెడుతున్నాయి. ఇక సునీల్ కి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: