ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలి అంటూ ఆ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారు ఈ అంశంపై పోరాటం మొదలు పెట్టి 200 రోజులు అయిన సందర్భంగా టీడీపీ నేతలు వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యాలయంలో దీక్ష కూడా చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే దీనిపై టీడీపీ మాజీ మంత్రి... reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్వీట్ చేసారు. భూములిచ్చిన త్యాగమూర్తులు భార్యాపిల్లలతో 200 రోజులుగా నిరంతర పోరాటం చేస్తూ అందరి మనస్సుల్లో నిలిచిపోయారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మీకు మా పూర్తి మద్దతుంటుంది.భగవంతుడున్నాడు. రాజధానిని అమరావతి నుంచి కదిలించలేరు.” అని ఆయన ట్వీట్ చేసారు.
భూములిచ్చిన త్యాగమూర్తులు భార్యాపిల్లలతో 200 రోజులుగా నిరంతర పోరాటం చేస్తూ అందరి మనస్సుల్లో నిలిచిపోయారు.రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.మీకు మా పూర్తి మద్దతుంటుంది.భగవంతుడున్నాడు.
— Somireddy chandra mohan Reddy (@Somireddycm) July 4, 2020
రాజధానిని అమరావతి నుంచి కదిలించలేరు.#200DaysOfAmaravatiProstests pic.twitter.com/Vuau1QUQ3S