టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు మరోసారి రాజధాని నాటకానికి తెరతీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 13 జిల్లాల అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచించలేదని.... చంద్రబాబు అమరావతి కోసం 5 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శలు చేశారు. కేవలం ఒక్క మండలంలో రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు అమరావతి గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. 
 
అమరావతి గురించి బాబు ఆలోచనలు మారకపోతే కాలగర్భంలో కలిసి పోతారని విమర్శలు చేశారు. వ్యాపార లబ్ది కోసం ఆడుతున్న బాబు కపట నాటకాన్ని కట్టిపెట్టాలని.... సీఎం జగన్ ఇతర ప్రాంతాలతో పాటు అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: