మొదటినుంచి విద్యా విషయంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరోసారి ముందడుగు వేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే సరికొత్త పద్ధతిని అమల్లోకి తీసుకురానుంది జగన్ సర్కార్. విద్యార్థులకు తమ భవిష్యత్తు కోసం గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలో ఐఐటి నీట్ అకాడమీ లను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
నిరుపేదలు సైతం ఉన్నతమైన మెరుగైన విద్యను అభ్యసించేందుకు పోటీని తట్టుకునేందుకు ఐఐటీలో సీటు సాధించేందుకు ఈ అకాడమీలు ఎంతగానో దోహదపడతాయని ఆయ అన్నారు, ఈ రెండు ప్రాంతాల్లో అకాడమీ ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు,