ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి షర్మిల ట్విట్టర్ వేదికగా జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు అని.... ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరగబోతుందని ట్వీట్ చేశారు. ఆమె ఈ ట్వీట్ తో పాటు ఒక వీడియోను కూడా జత చేశారు. సీఎం జగన్ వైయస్సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 8న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. అర్హులైన పేదలకు నూటికి నూరుశాతం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. 
 
ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అర్హులై ఇళ్ల పట్టాలు అందకపోతే గ్రామ, వార్డ్ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇళ్ల స్థలాలు పంపిణీ తర్వాత నాలుగేళ్లలో వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామని సీఎం జగన్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: