గత మూడు నలుగు రోజుల నుంచి ఉగ్రవాదులకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాష్మీ  జోన్ పోలీసులు సహా అక్కడి బలగాలు ఇప్పుడు మళ్ళీ వరుస ఆపరేషన్ లు మొదలు పెట్టాయి. కుల్గాంలోని అర్రా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మరియు భద్రతా దళాలు ఈ కాల్పుల్లో పాల్గొన్నాయి అని కాశ్మీర్ జోన్ పోలీస్ లు వెల్లడించారు. 

 

ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదికి గాయాలు అయ్యాయి అని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో భారీగా బలగాలు మొహరించాయి. పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన ఘటనలు పదే పదే  జరుగుతున్న నేపధ్యంలో బలగాలను భారీగా మొహరించారు. నిన్న కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన జరిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: