మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా ఏ రేంజ్ లో పెరుగుతుందో పోలీసుల్లో కూడా అదే విధంగా ప్రతీ రోజు వందల మంది కరోనా బారిన పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా మరోసారి భారీగా కరోనా పోలీసులకు సోకింది. 

 

గత 72 గంటల్లో మహారాష్ట్ర పోలీసులకు చెందిన 237 మంది సిబ్బందికి కరోనా సోకింది అని వెల్లడించారు. మొత్తం 64 మంది పోలీసులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు అని మహారాష్ట్ర  పోలీసులు వెల్లడించారు. ఇక మహారాష్ట్రలో కరోనా కేసులు రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. అక్కడ ప్రతీ రోజు కూడా 6 వేల వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: