మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన త్యాగాలను ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సిఎం వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేసారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి, దేశం కోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు. అల్లూరి త్యాగం తెలుగు జాతికే గొప్ప గౌరవం. మన్యం వీరుడి జయంతి సందర్భంగా నివాళులని సిఎం వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
`గిరిజనుల హక్కులకోసం పోరాడి, వారిలో స్వాతంత్ర్య ఉద్యమస్ఫూర్తిని రగిల్చి, దేశంకోసం సాయుధ తిరుగుబాటు చేసిన యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు. అల్లూరి త్యాగం తెలుగుజాతికే గొప్ప గౌరవం. మన్యంవీరుడి జయంతి సందర్భంగా నివాళులు.#AlluriSitaRamaRaju
— jagan MOHAN REDDY' target='_blank' title='ys jagan mohan reddy-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ys jagan mohan reddy (@ysjagan) July 4, 2020