తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ పై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండే సౌకర్యాలపై ప్రజలతో పాటు అప్పటి విపక్షాలు కూడా తీవ్ర ఆరోపణలు చేసేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా మార్చే విధంగా ఏపీ సిఎం వైఎస్  జగన్ అడుగులు వేస్తున్నారు. 

 

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ హాస్పిటళ్లను ఎలుకలకు వదిలేసి కార్పోరేట్ ఆసుపత్రులను ప్రమోట్ చేశాడు బాబు అని ఆయన ఆరోపించారు. పొరుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ వర్తించదని జిఓలిచ్చింది అందుకే అని అన్నారు. 1800 అంబులెన్సులు కొన్నానని నిర్లజ్జగా బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. గుట్టలుగా మూలకు పడిన 108 వాహనాల ఫోటోలను ప్రజలంతా చూసారని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: