కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వారిలో ఫోటో గ్రాఫర్లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. వారి ఇషయంలో ప్రభుత్వాలు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు అనే వాదన కూడా ఉంది. పెళ్ళిళ్ళు, ఏ ఫంక్షన్ కార్యక్రమాలు లేకపోవడంతో వారి భవిష్యత్తు ఇప్పుడు అందకారంగా మారింది. ఈ  నేపధ్యంలో వారి కష్టాలపై స్పందించాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

 

ఫొటో, వీడియో గ్రాఫర్లకు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని ఆయన సిఎం జగన్ ని కోరారు. కష్టకాలంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. అదే విధంగా ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించాలని పవన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: