ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉండి అన్ని పరీక్షలను రద్దు చేయడం వాయిదా వేయడం చేస్తుంటే కర్ణాటక సర్కార్ మాత్రం... కీలక అడుగు వేసింది. ఎవరు ఎన్ని చెప్పినా సరే వినకుండా కర్ణాటక ప్రభుత్వం పదో తరగతి పరిక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో పాల్గొన్న 32 మంది విద్యార్ధులకు కరోనా సోకింది. 

 

భౌతిక దూరం పాటించినా సరే వారికి కరోనా రావడంతో అధికారులు రాష్ట్ర ప్రభుత్వం షాక్ అయింది. ఇక వారిలో ఎంత మందికి ఇతరులతో కాంటాక్ట్ ఉంది అనే దానిని ఆరా తీస్తున్నారు. ఇక అక్కడ కరోనా సోకుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా పరీక్షలను నిర్వహించడం పై అధికార బిజెపి లో కూడా తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: