తెలంగాణ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,850 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 22,312కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,487 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
గత 24 గంటల్లో 1,342 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ఐదుగురు మృతి చెందారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 288కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,572 కేసులు నమోదయ్యాయి. నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: