అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ట్రంప్ మొదటి నుంచి భావిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలతోపాటు తన ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్య నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఖాతరు చేస్తూ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అమెరికాలో కరోనా వైరస్ భారీగా పెరుగుతున్న వేళ ఎక్కువ సంఖ్యలో ప్రజలు గుమిగూడవద్దని ఆరోగ్య శాఖ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా అమెరికా244 వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దూరంగా ఉండాలని అర్థిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రాజధాని వాషింగ్టన్​లో శనివారం సాయంత్రం భారీ వేడుకలకు సిద్ధమయ్యారు.


ఈ నేపథ్యంలో అమెరికా-భారత్ స్నేహ బంధానికి గుర్తుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా 
అమెరికా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. దీనికి స్పందించిన అగ్రరాజ్య అధినేత ట్రంప్ ధన్యవాదాలు మిత్రమా..! భారత్ ను అమెరికా ప్రేమిస్తుంది అని ట్వీట్ చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: