దాదాపు ఆరు నెలల నుంచి ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నా సరే వారి తీరులో మాత్రం ఏ  మార్పు రావడం లేదు. భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని తమకు పట్టున్న ప్రాంతాల్లో వరుస దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని పుల్వామాలో దాడి చేసారు. 

 

జమ్మూ కాష్మీర్ రాష్ట్రంలోని పుల్వామా, గంగూ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ దాడిలో ఒక సిఆర్‌పిఎఫ్ జవాన్ గాయపడ్డారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. భారత ఆర్మీ  ప్రాంతాన్ని చుట్టుముట్టి జల్లెడ పడుతుంది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: