దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు... పార్లమెంట్ సమావేశాలు  జరిగే అవకాశం ఉందా లేదా అనే దానిపై పెద్ద చర్చలే నడుస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి ఉంది. పార్లమెంట్ వర్షా కాల సమావేశాలను ఈ నెల చివర్లో నిర్వహించే అవకాశం ఉంది అని భావించారు. 

 

అయితే వచ్చే నెల చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య వరకు నిర్వహించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. రెండు వారాల పాటు వాటిని నిర్వహించే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. దీనిపై కేబినేట్ లో నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రెండు విడతలు గా నిర్వహించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: