దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 25 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి అంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత 24 గంటల్లో అత్యధికంగా 24,850 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక రికార్డ్ స్థాయిలో నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 613 మరణాలు నమోదయ్యాయి. 

 

దేశ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్  కేసులు 6,73,165 గా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. వీటిలో 2,44,814 క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించింది. 4,09,083 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని  పేర్కొంది. ఇక మరణాలు కూడా 20 వేలకు దగ్గరగా ఉన్నాయి. 19,268 మంది కరోనా కారణంగా మరణించారు అని  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: