కరోనా విషయంలో మానవత్వం అనేది పెద్దగా ఎక్కడ చూసినా సరే కనపడే అవకాశాలు లేవు. కరోనా విషయంలో... ఉన్న భయమే ప్రజలను మానవత్వం లేకుండా తయారు చేస్తుంది. ఇక సిబ్బంది కూడా అదే విధంగా ఉన్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎర్రగడ్డ స్మశాన వాటికాలో ఒక దారుణం జరిగింది. 

 

సిబ్బంది మృతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేసి వెళ్తున్నారు. దీనితో మంటలు ఆరిన తర్వాత మృతదేహాలు కనపడుతున్నాయి. ఇవి కుళ్ళి వాసన వచ్చే అవకాశం ఉంది. దీనితో స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి అని పలువురు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి.  కనీస మానవత్వం కూడా లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: