కరోనా వైరస్ ని సమర్ధవంతంగా కట్టడి చేసిన చిన్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ కూడా ఉంది. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉన్నా సరే కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడంతో అక్కడ కేసులు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. ప్రతీ రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యేవి.

 

ఇక ఇప్పుడు అక్కడ భారీగా కేసులు తగ్గాయి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ ఈ రోజు కొత్త కేసులు ఏమీ నమోదు కాలేదు అని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1046గా ఉండగా 326 క్రియాశీల కేసులు మరియు 9 మరణాలు ఉన్నాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కాసేపటి క్రితం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: