గత రెండు నెలలుగా మావోయిస్ట్ లకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కరోనా దెబ్బకు మావోలకు గతంలో ఉన్న స్వేచ్చ ఇప్పుడు లేకుండా పోయింది అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే... తాజాగా ఒడిశాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కంధమాల్ జిల్లాలో ఈ రోజు ఉదయం భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు అని పోలీసులు వెల్లడించారు.

 

కూంబింగ్ నిర్వహిస్తున్న సమయ౦లో తారస  పడిన మావోలు భద్రతా బలగాలను లక్ష్యంగా కాల్పులు జరపగా... ఈ కాల్పులలో నలుగురు మావోలు మరణించారు. మరి కొంత మంది గాయపడినట్టు తెలుస్తుంది. ఈ కాల్పుల్లో భద్రతా సిబ్బందికి కూడా గాయాలు అయినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: