మహారాష్ట్ర పోలీసుల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. పోలీసుల్లో 55 ఏళ్ళు పైబడిన వారు విధులకు రావొద్దు అని చెప్పినా సరే  కేసులు పోలీసుల్లో క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఇదిలా  ఉంటే తాజాగా మరోసారి మహారాష్ట్ర పోలీసుల్లో కేసులు పెరిగాయి. 

 

గత 24 గంటల్లో నలుగురు పోలీసులు కరోనా కారణంగా మరణించారు అని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. అదే విధంగా 30 మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మహారాష్ట్ర పోలీసులలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 5205గా ఉంది. ఇందులో 4071 రికవరీలు మరియు 1070 క్రియాశీల కేసులు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: